Pawan Kalyan: కూకట్‌పల్లి, కొత్తగూడెం సహా 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన

Janasena releases 8 candidates for telangana assembly

  • పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించిన బీజేపీ
  • కూకట్‌పల్లి నుంచి బరిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
  • కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్న లక్కినేని సురేందర్ రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది.

జనసేన పోటీ చేసే స్థానాలు... అభ్యర్థులు...

కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు - నేమూరి శంకర్ గౌడ్, కోదాడ - మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం - మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News