Prashant Kishor: డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీలా అడుక్కుతింటామని ప్రశాంత్ కిశోర్ చెప్పారంటూ వీడియోను పోస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu shares video of Prashant Kishor

  • సంపదను సృష్టించినప్పుడే డబ్బులను పంచగలమన్న ప్రశాంత్ కిశోర్
  • సంపదను సృష్టించనప్పుడు పంచడానికి డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారని ప్రశ్న
  • సంపదను సృష్టించకపోతే సమాజానికి అన్యాయం చేసిన వాళ్లమవుతామని వ్యాఖ్య

సంపదను సృష్టించినప్పుడే.. డబ్బులను పంచగలమని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. సంపదను సృష్టించేలా సమాజానికి హెల్ప్ చేయలేకపోతే... పంచడానికి డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఈ డబ్బు కోసం భారీగా అప్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఏపీని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంపదను సృష్టించకపోతే సమాజానికి అన్యాయం చేసిన వాళ్లమవుతామని చెప్పారు. ఈ వీడియోను టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అభివృద్ధి చేయకుండా, డబ్బును సంపాదించకుండా, పంచుకుంటూ పోతే ఏపీలా అడుక్కుతింటామని ప్రశాంత్ కిశోర్ చెప్పారని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలు ఏపీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని పీకే చెప్పారని ట్వీట్ చేశారు.

Prashant Kishor
YSRCP
Andhra Pradesh
Ayyanna Patrudu
Telugudesam
  • Loading...

More Telugu News