Nara Lokesh: కాసేపట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ భేటీ.. పాల్గొననున్న ఇరు పార్టీల ముఖ్య నేతలు

Nara Lokesh and Pawan kalyan meeting

  • టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
  • రాజమండ్రి మంజీరా హోటల్ లో భేటీ
  • కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఇరు పార్టీలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఇరుపార్టీలతో కూడిన సమన్వయ కమిటీ భేటీ కానుంది. టీడీపీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భేటీలో పాల్గొననున్నారు. వీరితో పాటు ఇరు పార్టీల నుంచి 6 మంది చొప్పున కీలక నేతలు హాజరు కానున్నారు. రాజమండ్రిలోని మంజీరా హోటల్ లో ఈ సమావేశం జరగనుంది. పవన్ కల్యాణ్ కాసేపట్లో రాజమండ్రికి చేరుకోనున్నారు. ఈ సమావేశాన్ని ఇరు పార్టీలు చాలా కీలకంగా భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 1.20 నిమిషాలకు పవన్ రాజమండ్రికి చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News