Payal Rajputh: నాకు కిడ్నీ సమస్య ఉంది.. ఆపరేషన్ వాయిదా వేసుకున్నా: పాయల్ రాజ్‌పుత్

Payal Rajputh reveals she is suffering from kidney infection during mangalavaram trailer launch

  • అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మంగళవారం’ మూవీ
  • మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వ్యక్తిగత విషయాలు పంచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్
  • సినిమా పూర్తయ్యే వరకూ తన కిడ్నీ ఆపరేషన్‌ను వాయిదా వేసుకున్నట్టు వెల్లడి
  • ఈ మూవీతో దర్శకుడు తనను మరోసారి లాంచ్ చేస్తున్నారని వ్యాఖ్య

అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిపింది. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని, డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ కూడా చేయాలన్నారని చెప్పింది. 

‘‘అజయ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యే టైంకి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. డాక్టర్స్ సర్జరీ చేయాల్సిందేనని కచ్చితంగా సూచించారు. అయితే, అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా పూర్తి చేశాకే సర్జరీకి వెళ్తానని చెప్పాను’’ అని ఆమె తెలిపింది. 

‘‘ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతోందో తెలియని అనిశ్చితి నెలకొన్న సమయంలో ‘మంగళవారం’ సినిమా వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ భూపతి నన్ను లాంచ్ చేశారు. అది నా కెరీర్‌ను మార్చేసింది. ఇప్పుడు ‘మంగళవారం’లో అవకాశం ఇచ్చి మరోసారి నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న పాయల్ మరోసారి తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు అజయ్‌నే నమ్ముకుంది. మరోవైపు, ‘మంగళవారం’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

  • Loading...

More Telugu News