KCR: తిరుగు ప్రయాణంలో రోడ్ సైడ్ దాబాలో ఆగి చాయ్ తాగిన కేసీఆర్, హరీశ్ రావు

KCR and Harish Rao drunk tea at road side daba

  • సిరిసిల్ల, సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్
  • సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో ఛాయ్ తాగిన కేసీఆర్
  • కాసేపు నేతలతో సరదా ముచ్చట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు పక్కన ఉండే దాబాలో చాయ్ తాగారు. ఈ రోజు ఆయన రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తూ, మార్గమధ్యంలో కొద్దిసేపు దాబాలో ఆగి చాయ్ తాగారు. కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్ రావు తదిరులు కూడా ఉన్నారు. వారు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. కాగా, సిరిసిల్లలో తనయుడు కేటీఆర్‌పై, సిద్దిపేటలో అల్లుడు హరీశ్ రావుపై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.

KCR
Harish Rao
BRS
Telangana Assembly Election
  • Loading...

More Telugu News