BRS: మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్

BRS Party Chief KCR Is Going to Release Manifesto

  • ఒక్కొక్కరిగా చేరుకుంటున్న నేతలు
  • మధ్యాహ్నం పార్టీ మేనిఫెస్టో విడుదల
  • అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్న సీఎం

పార్టీ మేనిఫెస్టో ప్రకటన.. బీఫామ్ లు అందజేత నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే దాదాపు నేతలంతా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రానున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి, అభ్యర్థులకు బీఫామ్ లు అందజేయనున్నారు. ఆపై ఎన్నికల ప్రచారంపై పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఆపై సాయంత్రం హుస్నాబాద్ లో జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొంటారు. హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం.

తెలంగాణ భవన్ వద్ద మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని.. ఈ రోజు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఎలాంటి హామీ ఇవ్వని అంశాలనూ ఆయన చేసి చూపిస్తారని వివరించారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసని, రాష్ట్ర ప్రజలంతా ఆయన వెంటే ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు హామీలను జనం నమ్మట్లేదని మల్లారెడ్డి చెప్పారు.

BRS
KCR
Telangana Bhavan
Malla reddy
Manifesto

More Telugu News