Team India: కాసేపట్లో ఆసీస్‌తో భారత్ రెండో వన్డే.. జట్టుతో కలిసి ఇండోర్ వెళ్లని స్టార్​ పేసర్​ బుమ్రా

Jasprit Bumrah did not travel with the team to Indore for the 2nd ODI

  • కుటుంబాన్ని చూసేందుకు ముంబై వెళ్లిన బుమ్రా
  • అతనికి స్వల్ప విరామం ఇచ్చినట్టు బీసీసీఐ ప్రకటన
  • బుమ్రా స్థానంలో జట్టులోకి ముకేశ్ కుమార్

భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య కాసేపట్లో ఇండోర్‌‌లో రెండో వన్డే మొదలవనుండగా బీసీసీఐ కీలక విషయం వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ‘రెండో వన్డే కోసం జస్ప్రీత్ బుమ్రా జట్టుతో కలిసి ఇండోర్ వెళ్లలేదు. తన కుటుంబాన్ని చూడటానికి ఇంటికి (ముంబై) వెళ్లిన బుమ్రాకు టీమ్ మేనేజ్‌మెంట్ స్వల్ప బ్రేక్ ఇచ్చింది. 

ఈ వన్డేలో బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ముకేష్ కుమార్ జట్టులోకి వచ్చాడు. రాజ్‌కోట్‌లో జరిగే ఆఖరి వన్డేలో బుమ్రా జట్టులో చేరనున్నాడు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాగా, తొలి వన్డేలో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి మూడు వన్డేల సిరీస్‌ను ఇండోర్‌‌లోనే కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News