rishi sunak: జీ20 సదస్సు: భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్

UK Prime Minister Rishi Sunak arrives in Delhi

  • శని, ఆదివారం జరగనున్న జీ20 సదస్సుకు సిద్ధమైన ఢిల్లీ
  • దేశ రాజధాని చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
  • రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10 (శని, ఆదివారాలు)లలో జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ సదస్సుకు భారత్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. భద్రతాపరమైన నిబంధనలు గురువారం రాత్రి నుండి ఒక్కటొక్కటిగా అమల్లోకి వస్తున్నాయి. మరోవైపు ఆయా దేశాధినేతలు ఢిల్లీలో అడుగుపెడుతున్నారు.

తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశ రాజధానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం వారికి ఘన స్వాగతం పలికింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హాజరవడం లేదు. వీరి తరఫున ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన రావడం లేదు.

జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ తదితరులు హాజరవుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు జోబైడెన్ భారత్‌కు చేరుకోవచ్చు. ఆయనకు కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలుకుతారు.

జీ20లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూయడ ఉంది. 

rishi sunak
g20 summit
New Delhi
Narendra Modi
Bangladesh
  • Loading...

More Telugu News