Revanth Reddy: నేను చంద్రబాబు శిష్యుడిని కాదు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy says he is not Chandrababu follower

  • చంద్రబాబుకు సహచరుడిగా పని చేశానన్న రేవంత్
  • డ్రగ్స్ కేసులో పిల్ వేసి కోర్టులో పోరాడామన్న టీపీసీసీ చీఫ్
  • కేసీఆర్‌కు సంబంధం లేకుంటే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్న

డ్రగ్స్ కేసు విషయంలో తాము పిల్ వేసి కోర్టులో పోరాడామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ కేసులో కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకుంటే కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. 

తాను చంద్రబాబు నాయుడి శిష్యుడిని అని చెప్పడంపై కూడా రేవంత్ స్పందించారు. తాను శిష్యుడిని కాదని, టీడీపీ అధినేతకు సహచరుడిగా పని చేశానన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణ పక్షానే నిలిచానని చెప్పారు. ఇప్పటి వరకు తాను పాలకులతో కలిసి ఏ ప్రభుత్వంలో లేనని చెప్పారు.

  • Loading...

More Telugu News