Andhra Pradesh: వరదలో చిక్కుకున్న కుక్క పిల్లలు.. పోలీసుల చుట్టూ తిరిగిన తల్లి కుక్క.. వీడియో ఇదిగో!

Dog Request to Police for Save Her Baby Dogs

  • కుక్కతో పాటు వెళ్లి దాని పిల్లలను కాపాడిన రెస్క్యూ టీమ్
  • ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

కన్న ప్రేమకు ఏదీ సాటి రాదని ఓ శునకం నిరూపించింది.. వరదలో చిక్కుకున్న పిల్లల కోసం అల్లాడిపోయింది. బిడ్డలను కాపాడాలంటూ సహాయక బృందాల చుట్టూ తిరుగుతూ మూగగా రోధించింది. చుట్టూ తిరుగుతూ మొరుగుతున్న కుక్కను గమనించిన సహాయక సిబ్బంది దాని వెంటే వెళ్లగా వరద నీటిలో చిక్కుకున్న ఓ ఇంట్లో కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో అసలు విషయం అర్థం చేసుకున్న పోలీసులు.. ఆ కుక్క పిల్లలను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

భారీ వర్షాలకు నందిగామ జిల్లాలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. అక్కడున్న జనాలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా శ్రమించారు. ఈ క్రమంలో ఓ కుక్క వారి చుట్టూ తిరుగుతోంది. మొదట్లో పట్టించుకోకపోయినా పదే పదే మొరుగుతూ, రోధించడం చూసి రెస్క్యూ సిబ్బంది దాని వెంటే వెళ్లారు. ఆ కుక్క వారిని ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లింది.

ఆ ఇంట్లో కుక్క యజమాని ఉండొచ్చని భావించి లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ రెండు కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో ఆ కుక్క బాధను వారు అర్థం చేసుకోగలిగారు. వెంటనే ఆ పిల్లలను బయటకు తీసుకువచ్చి తల్లి కుక్క చెంతకు చేర్చారు. తన పిల్లల కోసం ఆ కుక్క పడిన ఆరాటం వారి మనసులను కదిలించింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. కుక్క పిల్లలను కాపాడిన రెస్క్యూ టీమ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Andhra Pradesh
floods
nandigama
dog
offbeat
Viral Videos

More Telugu News