NSR Prasad: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత

Tollywood Director NSR Prasad passes away

  • గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
  • ఆయన వయసు 49 సంవత్సరాలు
  • దర్శకుడిగా ప్రసాద్ కు తొలి అవకాశం ఇచ్చిన రామానాయుడు

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ ఆకస్మిక మరణం చెందారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' చిత్రాలను తెరకెక్కించారు. ఆయన తాజా చిత్రం 'రెక్కీ' విడుదల కావాల్సి ఉంది. ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

NSR Prasad
Director
Tollywood
  • Loading...

More Telugu News