Jagan: 6 ఆహారశుద్ది యూనిట్లకు ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు శంకుస్థాపన చేసిన జగన్

Jagan stars 11 food processing units

  • 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన జగన్
  • ఈ ప్రాజెక్టుల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి
  • వీటి నుంచి లబ్ధి పొందనున్న 40,307 మంది రైతులు

ఆహారశుద్ధి పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చేలా పలు ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు శ్రీకారం చుట్టారు. రూ. 1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులను ఈ ఉదయం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వాటిలో ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం, ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్లకు 3.14 లక్షల టన్నుల సామర్థ్యం ఉంది. వీటి ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాదు 40,307 మంది రైతులకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ ను రైతులకు సీఎం అంకితం చేశారు. ఈరోజు జగన్ ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా, ఒకటి మిల్లెట్స్, ఒకటి ఉల్లి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి.

Jagan
YSRCP
Food Processing Units
  • Loading...

More Telugu News