BCY Party: భారత చైతన్య యువజన పార్టీ... ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన రామచంద్ర యాదవ్

BCY Party announced by Ramachandra Yadav

  • గుంటూరు నాగార్జున వర్సిటీ వద్ద ప్రజా సింహగర్జన సభ
  • కొత్త పార్టీ పేరు ప్రకటించిన రామచంద్ర యాదవ్
  • సభకు హాజరైన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్

ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ... సంక్షిప్తంగా బీసీవై పార్టీ. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ సాయంత్రం ప్రజా సింహగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో రామచంద్రయాదవ్ తన పార్టీ పేరును ప్రకటించారు. 

ఈ సభకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, ఢిల్లీ వర్సిటీ ఫ్రొఫెసర్, బీసీ ఉద్యమకారుడు సూరజ్ మండల్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సభలో రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం మొదలవ్వాలని అన్నారు.

BCY Party
Ramachandra Yadav
Praja Simha Garjana
Guntur
Andhra Pradesh
  • Loading...

More Telugu News