Mahesh Babu: మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టేది అప్పుడేనట!

Rajamouli and Mahesh Babu Movie Update

  • షూటింగు దశలో ఉన్న 'గుంటూరు కారం'
  • అత్యధిక పారితోషికం అందుకున్న మహేశ్
  • కథానాయికలుగా శ్రీలీల - మీనాక్షి చౌదరి
  • జనవరి 12వ తేదీన విడుదల 
  • ఆగస్టు 9న రాజమౌళితో ప్రాజెక్టు ప్రారంభమనే టాక్  

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై విజయేంద్ర ప్రసాద్ కసరత్తు నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఎప్పుడు ఈ ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొడతారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం హల్ చల్ చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే. ఆ రోజున ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. అంటే .. ఆ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెబుతున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన కెరియర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా, జనవరి 12వ తేదీన విడుదల కానుంది. 

  • Loading...

More Telugu News