Alluri Krishnam Raju: రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూత

Rajolu former MLA Alluri krishnamraju passes away

  • వయోభారంతో బుధవారం హైదరాబాద్‌లో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే
  • సఖినేటిపల్లిలోని స్వగృహానికి మృతదేహం తరలింపు
  • గురువారం మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు

రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు (83) కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. 2004-2009 మధ్య కాలంలో ఆయన రాజోలు ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన 1999లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి, ఏవీ సూర్యనారాయణరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 

అనంతరం, 2004లో మళ్లీ బరిలోకి దిగి సత్యనారాయణరాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ఆ దంపతులకు కుమారుడు శ్రీనివాసరాజు, కుమార్తెలు కృష్ణకుమారి, విజయ ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. 

కృష్ణంరాజు భౌతిక కాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు.

Alluri Krishnam Raju
Dr BR Ambedkar Konaseema District
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News