Uttar Pradesh: మంచంపై నోట్ల కట్టలతో భార్యాపిల్లల సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి

UP cop in trouble after wife children take selfie with bundles of Rs 500 notes

  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన, నెట్టింట్లో ఫొటో వైరల్
  • అంత డబ్బు పోలీసు అధికారికి ఎలా వచ్చిందో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం
  • పోలీస్ లైన్స్‌కు అధికారి బదిలీ
  • అది వారసత్వ ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు అని పోలీసు అధికారి వివరణ

మంచంపై నోట్ల కట్టలతో తన భార్యాపిల్లలు దిగిన సెల్ఫీ ఓ పోలీసు అధికారిని చిక్కుల్లో పడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీస్ ఆఫీసర్ రమేశ్ చంద్ర సహానీ భార్యాపిల్లలు మంచంపై నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సొమ్ము మొత్తం రూ.14 లక్షలు అని సమాచారం. అంతడబ్బు సహానీకి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అంతేకాకుండా, సహానీని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. 

ఈ మొత్తం ఉదంతంలో తన తప్పేమీ లేదని సహానీ మీడియాకు స్పష్టం చేశారు. అది తన వారసత్వ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు అని స్పష్టం చేశారు. అది ఎప్పుడో 2014లో తీసిన ఫొటో అని వివరించే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News