dadisetti raja: మంత్రి రాజా మామ బెదిరించి భూమిని అగ్రిమెంట్ చేయించుకున్నారంటూ మహిళ ఆరోపణలు!

woman weeps and allges land kabja allegations on minister relative

  • మంత్రి దాడిశెట్టి మామపై భూకబ్జా ఆరోపణలు
  • బెదిరించి, అగ్రిమెంట్ చేయించుకున్నారని మహిళ ఆరోపణ
  • తనపై బురదజల్లేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మామ వివరణ

మంత్రి దాడిశెట్టి రాజా మామపై ఓ మహిళ భూకబ్జా ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉన్న రెండు ఎకరాల 36 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయాలని దాడిశెట్టి మామ సూర్యచక్రం కుట్రచేస్తున్నారని పాల్తేరుకు చెందిన బాలకామేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో తమను బెదిరించి బలవంతంగా అగ్రిమెంట్ చేయించుకున్నారన్నారు. డబ్బులు చెల్లించమంటే బెదిరిస్తున్నారని ఆరోపించారు. సూర్యచక్రంను వెంటనే అరెస్ట్ చేసి, తమ భూమిని ఇప్పించాలని ఆమె కోరారు. తాము రెండేళ్లుగా దీని కోసం తిరుగుతూనే ఉన్నామని కంటతడి పెట్టారు. తనకు న్యాయం జరగకుంటే చావడానికైనా సిద్ధమన్నారు.

మహిళ ఆరోపణలపై సూర్యచక్రం కూడా స్పందించారు. తనపై బురదజల్లేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని అమ్మేందుకు కామేశ్వరి ఒప్పందం చేసుకున్నారని, రూ.90 లక్షల మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నారని గుర్తు చేశారు. డబ్బులు తీసుకొని, తిరిగి తననే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. న్యాయపరంగా అనుమతులు తెచ్చుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ ఆలస్యమవుతోందన్నారు. తాము మానవతా దృక్పథంతో చూసినా ఆరోపణలు చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News