Mangal Dhillon: కేన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన నటదర్శకుడు మంగళ్ ధిల్లాన్

Actor director Mangal Dhillon passes away

  • సుదీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న మంగళ్ ధిల్లాన్
  • లుధియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • 2017లో చివరిసారి ‘తూఫాన్ సింగ్’ సినిమాలో కనిపించిన నటుడు

బాలీవుడ్ సీనియర్ నటదర్శకుడు మంగళ్ ధిల్లాన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన లుధియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 18న ఆయన బర్త్ డే జరగాల్సి ఉండగా అంతలోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో జన్మించిన ఆయన ఢిల్లీలోని ఓ థియేటర్‌లో తొలుత పనిచేశారు.  

1986లో టీవీ షో ‘కథాసాగర్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడగుపెట్టారు. ఆ తర్వాత తిరుగన్నదే లేకుండా పలు షోలలో ఆయన కనిపించారు. ‘ఖూన్ భారీ మాంగ్’, ‘జక్మి ఔరత్’, ‘ట్రైన్ టు పాకిస్థాన్’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. చివరిసారి 2017లో వచ్చిన ‘తూఫాన్ సింగ్’లో మంగళ్ ధిల్లాన్ కనిపించారు. ఆయన మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ పలువురు నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు.

Mangal Dhillon
Bollywood
Train To Pakistan
Toofan Singh
  • Loading...

More Telugu News