Chandrababu: సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు.. మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ

Chandrababu to meet Modi and Amit Shah

  • రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
  • అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు
  • ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ పాలన, నేతలపై బీజేపీ నేతల విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News