Ram Pothineni: ప్యాన్ ఇండియా చిత్రంగా పూరి–రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’

Puri Jagannath Announces Sequel To Smart Shankar With Ram

  • ఇస్మార్ట్ శంకర్‌‌కు సీక్వెల్ ప్రకటించిన పూరి 
  • 2024 మార్చి 8న విడుదల కానున్న చిత్రం
  • పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మాణం

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరి కెరీర్‌‌కు ఈ చిత్రం ఊపిరి పోసింది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. సోమవారం రామ్ పుట్టిన రోజు కాగా.. ఒక రోజు ముందు సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయనకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమా2024 మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. 

పైగా, ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. పూరి, చార్మి నిర్మాతలుగా పూరి కనెక్ట్స్ బ్యానెర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

  • Loading...

More Telugu News