Hyderabad: రెండు గంటల పాటు శంషాబాద్ విమానాశ్రయం రన్‌వేపైనే నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం

Air India Flight Stays on Runway For 2 Hours With Passenger Onboard

  •  సాయంత్రం 4.24 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం
  • సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటల పాటు రన్‌వేపైనే నిలిపివేత
  • విమానం దిగనివ్వకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు

సాంకేతిక సమస్య కారణంగా ఓ విమానం రన్‌వేపైనే రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. హైదరాబాద్‌, శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ ఐ0541 విమానం సాయత్రం 4.24 గంటలకు బయలుదేరాలి. కానీ రన్‌వేపైనే నిలిచిపోయిన విమానం సాయంత్రం 6.15 వరకూ ప్రయాణం ప్రారంభించలేదు. ప్రయాణికులను విమానం నుంచి దిగనివ్వకపోవడంతో అంతా ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది ప్రయాణికులను తమ సీట్లల్లో అలాగే కూర్చోపెట్టేశారు. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణం ఆలస్యమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News