Telangana: నేడు తెలంగాణ ‘పది’ ఫలితాలు.. సత్తా చాటేదెవరో!

Telangana 10th Results Today

  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల గల్లంతు
  • అంతర్గత మార్కుల ఆధారంగా పాస్ చేసిన అధికారులు!

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. 

ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్  కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుని వారిని పాస్ చేసినట్టు సమాచారం.

కాగా, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే ప్రతిభ కనబరించారు. మరి ‘పది’లో పైచేయి ఎవరిదో చూడాల్సిందే.

Telangana
Telangana 10th Results
Sabitha Indra Reddy
SSC
  • Loading...

More Telugu News