BJP: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ ఛార్జిషీట్

AP bjp chargesheet on YSRCP government

  • ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్న బీజేపీ  
  • వైసీపీ నేతలు, ఇసుక బకాసరుల స్వార్థంతో ప్రజల ప్రాణాలు పోయాయని వ్యాఖ్య
  • సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 19వ తేదీన కొట్టుకు పోయిందని బీజేపీ గుర్తు చేసింది. ఇసుక మాఫియా కారణంగా అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నీటి ప్రవాహనంలో పడి కనీసం 33 మంది చనిపోయారని, వైసీపీ నేతలు, ఇసుక బకాసురుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రాణాలను అధికారులు బలి పెడుతున్నారన్నారు. దీనికి సంబంధించి బాధ్యులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News