Allari Naresh: మలయాళ బ్యూటీకి మరిన్ని ఛాన్సులు వచ్చేనా?

Mirnaa Special

  • మలయాళ సినిమాతో జరిగిన 'మిర్నా' ఎంట్రీ 
  • 'క్రేజీ ఫెలో'తో తెలుగు తెరకి పరిచయం 
  • మళ్లీ 'ఉగ్రం' సినిమాతో పలకరించనున్న బ్యూటీ 
  • ఈ నెల 5వ తేదీన విడుదలవుతున్న సినిమా   

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉన్నారు. కొంతమంది కథానాయికలు కొంతకాలం క్రితమే ఇక్కడి సినిమాలు చేసి, ఆ తరువాత గ్యాప్ తీసుకుని మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగుతున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో 'మిర్నా మీనన్' ఒకరుగా కనిపిస్తుంది.

ఈ కేరళ బ్యూటీ మలయాళ సినిమాతో 2020లో వెండితెరకి పరిచయమైంది. తొలి అవకాశాన్నే ఆమె మోహన్ లాల్ సినిమాతో అందుకోవడం విశేషం. ఆ తరువాత తమిళ .. తెలుగు సినిమాలపై కూడా ఆమె దృష్టి పెట్టింది. ఆది సాయికుమార్ జోడీగా 'క్రేజీ ఫెలో' సినిమాతో ఆమె టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన, అంతగా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. 

 అలాంటి మిర్నా మీనన్ మళ్లీ ఇప్పుడు 'ఉగ్రం' సినిమాలో అల్లరి నరేశ్ సరసన నాయికగా నటించింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలోని పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందనీ, తనకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆమె ప్రమోషన్స్ లో చెబుతోంది. మే 5వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, ఆమె నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News