Balakrishna: ఆ వెలుగు తెలుగు జాతికి వెయ్యేళ్ల వైభవం తెచ్చింది: బాలకృష్ణ

Balakrishna in NTR shathajayanthi fest

  • తెలుగు వాళ్లమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్న బాలయ్య
  • సంక్షేమానికి శ్రీకారం చుట్టి ఎన్టీఆర్ సరికొత్త చరిత్ర సృష్టించారని వ్యాఖ్య
  • ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో  బాలకృష్ణ

వందేళ్ల క్రితం వెలిగిన ఓ వెలుగు తెలుగు జాతికి వెయ్యేళ్ల వైభవం తెచ్చిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. తెలుగు వాళ్లమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఈ శతజయంతి వేడుకల కార్యక్రమంలో చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అంతకుముందు, ఎన్టీఆర్  శతజయంతి  వేడుకల  అంకురార్పణ సభలో  పాల్గొనేందుకు  రజనీకాంత్  కూడా గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్ ను బాలకృష్ణ ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ కార్యక్రమానికి వచ్చినందుకు రజనీకాంత్ కు  ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రజనీకాంత్, బాలకృష్ణ ఒకే కారులో  నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ ఇరువురు కాసేపు ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు నివాసంలో తేనీటి విందులో పాల్గొని, ఉత్సవాలకు వెళ్లారు.

Balakrishna
ntr
  • Loading...

More Telugu News