Himanshu: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుని తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించిన హిమాన్షు

Himanshu has receives graduation certificate

  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న హిమాన్షు
  • ఓక్రిడ్జ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుక
  • హాజరైన సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. హిమాన్షు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశాడు. 

12వ తరగతి పూర్తి చేసిన హిమాన్షు ఓక్రిడ్జ్ స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఆయన అర్ధాంగి శోభ, కేటీఆర్, ఆయన అర్ధాంగి శైలిమ, కుమార్తె అలేఖ్య కూడా హాజరయ్యారు. 

ఇక గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షు తాత కేసీఆర్ పాదాలకు నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మనవడి వినయవిధేయతలకు మురిసిన కేసీఆర్ దీవెనలు అందించారు. ఇక, కేటీఆర్ అయితే పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు హిమాన్షుకు ఈ వేడుకలోనే ఎక్స్ లెన్స్ అవార్డును బహూకరించారు.

Himanshu
KCR
Graduation
KTR
BRS
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News