Team India: చివరి వన్డేలో టీమిండియా ఓటమి... సిరీస్ ఆసీస్ కైవసం

Team India lost ODI series to Australia

  • చెన్నై వన్డేలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
  • 270 పరుగుల లక్ష్యఛేదనలో 248 పరుగులకు ఆలౌట్
  • ఆడమ్ జంపాకు 4 వికెట్లు
  • రాణించిన కోహ్లీ, పాండ్యా
  • కీలక దశలో వికెట్లు కోల్పోయిన భారత్

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఓ దశలో హార్దిక్ పాండ్యా (40) ధాటిగా ఆడుతుండడంతో భారత్ గెలుపు సులభమేనని అనిపించింది. అయితే ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా విజృంభించి బౌలింగ్ చేయడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టొయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు సాధించగా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.

  • Loading...

More Telugu News