New Delhi: క్యాబ్‌లో ప్రయాణం.. 21 కిలోమీటర్లకే రూ. 1525ల బిల్లు!

Uber collects rs 1525 for a 21 kilometer journey later refunds

  • ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్న మహిళకు వింత అనుభవం
  • జీపీఎస్ పొరపాటు కారణంగా అధిక బిల్లు
  • ఉబెర్‌కు ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు
  • తప్పు జరిగిందన్న ఉబెర్..అదనపు మొత్తం మహిళ వ్యాలెట్‌కు బదిలీ

ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉబెర్ క్యాబ్‌లో కేవలం 21 కిలోమీటర్ల ప్రయాణానికి ఆమె ఏకంగా రూ.1525 చెల్లించాల్సి వచ్చింది. ఆ తరువాత ఫిర్యాదు చేయడంతో ఉబెర్ ఆ అదనపు మొత్తాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేసింది. అయితే.. ఆ మొత్తాన్ని ఉబెర్ వాలెట్‌లోనే జమ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ మహిళ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్‌కు వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. తన గమ్యస్థానానికి చేరుకున్నాక బిల్లు మొత్తం రూ.1525 అని తేలడంతో ఆమె ఒక్కసారిగా అవాక్కైంది. కానీ.. కారు డ్రైవర్‌కు ఆ మొత్తాన్ని చెల్లించక తప్పలేదు. 

ఆ తరువాత మహిళ ఈ విషయమై ఉబెర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో.. సిబ్బంది ఆమె ప్రయాణం తాలూకు వివరాలు పరిశీలించాక బిల్లులో తప్పులు దొర్లిన విషయాన్ని అంగీకరించారు. జీపీఎస్‌లో లోపం కారణంగా క్యాబ్ రాష్ట్ర సరిహద్దు దాటినట్టు ట్రిప్ వివరాల్లో రికార్డయిందని చెప్పారు. దీంతో.. ఆమె అధికమొత్తం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉబెర్ సంస్థ.. మహిళ నుంచి అదనంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగిచ్చేసింది. కానీ.. ఉబెర్‌కు అనుసంధానంగా ఉన్న మహిళ డిజిటల్ వ్యాలెట్‌లో ఆ మొత్తాన్ని బదిలీ చేసింది.

  • Loading...

More Telugu News