Nara Lokesh: మార్చి 14 నుంచి పాదయాత్ర కొనసాగిస్తాను: లోకేశ్

Lokesh says he will continue Yuvagalam from March 14

  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎన్నికల నియమావళి కారణంగా లోకేశ్ పాదయాత్రకు విరామం
  • ఈ నెల 12, 13 తేదీల్లో పాదయాత్ర ఉండదన్న లోకేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోవడంపై నారా లోకేశ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు ఈ నెల 12, 13 తేదీల్లో విరామం ప్రకటించానని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. 

ఇవాళ యువగళం పాదయాత్రకు 41వ రోజు అని, తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైందని లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి-పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిపై చర్చకు సిద్ధం అంటూ నేను విసిరిన సవాల్ కు స్పందించని పిరికిపందలు పాదయాత్రకు అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News