Puri Jagannadh: చాలా రోజుల తర్వాత ముంబైలో కనిపించిన ఛార్మీ, పూరీ జగన్నాథ్

Puri Jagannadh and Chaarmi spotted in Mumbai airport

  • 'లైగర్' ఫ్లాప్ తర్వాత సైలెంట్ అయిన ఛార్మీ, పూరీ  
  • ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన జంట
  • అక్కడకు ఎందుకు వెళ్లారనే విషయంలో రావాల్సిన క్లారిటీ

టాలీవుడ్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మీలది ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఇద్దరూ కలిసి పలు సినిమాల నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. తాజాగా వారు విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'లైగర్' అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో, వీరిద్దరూ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఛార్మీ అయితే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది. 

అలాంటి వీరు తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఎయిర్ పోర్టులో వీరు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు ముంబైకి ఎందుకు వెళ్లారనే విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ లో ఏదైనా కొత్త ప్రాజెక్టు కోసం వెళ్లారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ మళ్లీ బహిరంగంగా కనిపించేసరికి సినీ అభిమానుల్లో జోష్ వచ్చింది. మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Puri Jagannadh
chaarmi
mumbai
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News