Lavanya Tripathi: ‘పులి-మేక’ వంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను అందించిన జీ 5కి థాంక్స్: లావణ్య త్రిపాఠి!

- జీ 5 నుంచి వచ్చిన 'పులి - మేక'
- థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- తనకి మంచి డెబ్యూ పడిందన్న ఆది
- డిఫరెంట్ రోల్ పడటం పట్ల లావణ్య త్రిపాఠి హర్షం
- ఈ తరహా కాన్సెప్టులు రావాలన్న సుస్మిత
ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్గా ‘పులి మేక’ యాడ్ అయ్యింది. ఈ ఒరిజినల్ను జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించాయి. లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ జంటగా నటించిన ఈ సిరీస్లో సిరి .. రాజా .. సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్బ్ రెస్పాన్స్ని రాబట్టుకుంటోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. 'పులి - మేక' విషయంలో ముందుగా కోనగారికి థాంక్స్ చెబుతున్నాను. తర్వాత జీ 5 వారికి థాంక్స్. 'పులి - మేక' స్క్రిప్ట్ .. క్యారెక్టరైజేషన్ బాగా నచ్చాయి. చక్రిగారు చక్కగా డైరెక్ట్ చేశారు. ఓటీటీ పరంగా మంచి డెబ్యూలాగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మగారు సహా యు.ఎస్లో నా రిలేటివ్స్ చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు ’’ అన్నారు.



డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్గారు నాకు గాడ్ ఫాదర్. ఇంత మంది నటీనటులను ఒక వేదికపై తీసుకు రావటం ఆయనకే సాధ్యం. లావణ్య త్రిపాఠిగారు, ఆది సాయికుమార్గారు పాత్రలు చాలా గ్రిప్పింగ్గా ఉన్నాయి. లావణ్యగారు ఫైట్స్ చేయటం చూస్తే షాకింగ్గా అనిపించింది. డైరెక్టర్ చక్రి నాకు కమర్షియల్ డైరెక్టర్గా తెలుసు. ఇలాంటి థ్రిల్లర్ను ఎలా చేస్తాడోనని అనుకున్నాను. కానీ తను ఏదైనా చేయగలనని ప్రూవ్ చేశాడు. నటీనటులకు .. సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు.