Janhvi Kapoor: తల్లిని తలుచుకుని భావోద్వేగాలకు గురైన జాన్వీకపూర్

Janhvi Kapoor emotional post on mother Sridevi

  • 2018లో శ్రీదేవి మరణం
  • ఇప్పటికీ నీ కోసం వెదుకుతున్నానంటూ జాన్వీ పోస్ట్
  • నువ్వు గర్వించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నానంటూ వెల్లడి

ఒకప్పుడు శ్రీదేవి తన అందచందాలు, అభినయంతో బాలీవుడ్ లో మకుటంలేని మహారాణిలా ఏలిన సంగతి తెలిసిందే. తల్లి బాటలోనే కెరీర్ లో ఎదగాలని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా కృషి చేస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ తల్లిని తలుచుకుని భావోద్వేగాలకు గురైంది. 

"అమ్మా... నీ కోసం ప్రతి చోట వెదుకుతూనే ఉంటాను. నేను ఏంచేసినా అది నువ్వు గర్వించేలా ఉండాలని కోరుకుంటాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అది నీతోనే మొదలవుతుంది... నీతోనే ముగస్తుంది" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అంతేకాదు, తల్లితో కలిసున్న ఫొటోను కూడా జాన్వీ పంచుకుంది. 

శ్రీదేవిని 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో విగతజీవురాలిగా ఉన్న స్థితిలో గుర్తించారు. అప్పటికి జాన్వీ కెరీర్ ఆరంభ దశలోనే ఉంది. శ్రీదేవి మరణం తర్వాత కుమార్తెలు జాన్వీ, ఖుషీలకు బోనీ కపూర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అటు, బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కూడా చెల్లెళ్ల పట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Janhvi Kapoor
Sridevi
Mother
Bollywood
Boney Kapoor
  • Loading...

More Telugu News