Pattabhi: గుడివాడ గుట్కాగాడు కొడాలి నాని, పిల్ల సైకో వల్లభనేని వంశీ అంటూ పట్టాభిరామ్ విమర్శలు

Pattabhi fires on Kodali Nani and Vallabhaneni Vamsi

  • జగన్ డీఎన్ఏ ఏమిటో కొడాలి నాని తెలుసుకోవాలన్న పట్టాభి
  • మా దరిద్రం నువ్వే జగన్ అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా
  • అమరావతి పేరుతో రూ. 3,013 కోట్ల అప్పు చేశారని మండిపాటు

గుడివాడ గుట్కాగాడు కొడాలి నాని, పిల్ల సైకో వల్లభనేని వంశీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ హెచ్చరించారు. తాడేపల్లి సైకో జగన్ డీఎన్ఏ ఏమిటో కొడాలి నాని తెలుసుకోవాలని... జగన్ డీఎన్ఏ చంచల్ గూడ జైలు అయితే, లోకేశ్ డీఎన్ఏ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ అని ఎద్దేవా చేశారు. లోకేశ్ దృష్టిలో డీఎన్ఏ అంటే కట్టడం, నిర్మించడం, అభివృద్ధి చేయడమని... జగన్ దృష్టిలో డీఎన్ఏ అంటే కూల్చడం, నాశనం చేయడం అని విమర్శించారు. రాష్ట్రం నుంచి సంస్థలను తరిమికొట్టిన డీఎన్ఏ జగన్ దని అన్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు తీసుకొచ్చిన డీఎన్ఏ చంద్రబాబుదని అన్నారు. వైయస్ భారతిని రోడ్డు మీదకు తీసుకొచ్చిందని జగనే అని చెప్పారు. 

రాష్ట్ర ప్రజలందరూ 'మా దరిద్రం నువ్వే జగన్' అనుకుంటున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పి బ్యాంకుల నుంచి రూ. 3 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని... ఇప్పుడు ఆ అప్పు కట్టాలంటూ బ్యాంకర్లు సీఆర్డీయే అధికారులను నిలదీస్తున్నారని తెలిపారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని 2019లో చెప్పిన జగన్... ఏ ముఖం పెట్టుకొని అమరావతి రాజధాని ముసుగులో రూ. 3,013 కోట్ల అప్పులు చేశారని ప్రశ్నించారు.

Pattabhi
Nara Lokesh
Chandrababu
Telugudesam
Jagan
Kodali Nani
Vallabhaneni Vamsi
YSRCP
  • Loading...

More Telugu News