Hyderabad: రూ.1800 విషయంలో భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

Hyderabad Man commits suicide after dispute with wife over rs 1800

  • హైదరాబాద్‌లో వ్యక్తి ఆత్మహత్య
  • డబ్బు విషయంలో భార్యతో గొడవ
  • మనస్తాపం చెంది మూసీ ఒడ్డున ఉరివేసుకున్న వ్యక్తి

డబ్బు విషయంలో భార్యతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ పరిధిలోని కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కార్వాన్ సత్యనారాయణ కాలనీకి చెందిన జగ్గేటి కిషన్, శ్యామల దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కిషన్ ఓ కబేళాలో పనిచేస్తున్నాడు. పెద్ద కూతురి వివాహం అయ్యింది. 

అయితే.. ఈ నెల 15న రూ. 1800 విషయంలో భార్య శ్యామలతో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత.. కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేస్తే త్వరగా వస్తానని చెప్పిన కిషన్.. పొద్దుపోయినా తిరిగిరాలేదు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం కార్వాన్ రాంసింగ్‌పురా చౌరస్తా సమీపంలోని మూసీనది ఒడ్డున ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కిషన్‌ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News