Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Tirumala updates

  • నిన్న స్వామివారిని దర్శించుకున్న 62,856 మంది
  • నిన్న శ్రీవారికి రూ.2.21 కోట్ల హుండీ ఆదాయం
  • టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం
  • రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం

తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకటేశ్వరస్వామిని నిన్న 62,856 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,115 మంది తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ కానుకల రూపంలో రూ.2.21 కోట్ల ఆదాయం లభించింది. 

కాగా, శ్రీవారి టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఈ నెల 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tirumala
Pilgrims
Devotees
TTD
  • Loading...

More Telugu News