Earthquake: ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం... భారత్ లోనూ ప్రకంపనలు

Tremors happens in India after earthquake hits Afghanistan

  • హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం
  • ఫైజాబాద్ కు 79 కిమీ దూరంలో భూకంప కేంద్రం
  • రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు
  • భారత్, పాకిస్థాన్ లోనూ కంపించిన భూమి

ఆఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వతశ్రేణిలో భూకంపం సంభవించింది. ఫైజాబాద్ కు దక్షిణంగా 79 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. 

దీని ప్రభావంతో భారత్, పాకిస్థాన్ దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 7.50 గంటల సమయంలో ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. 

దేశ రాజధాని ప్రాంతంలో జనవరి 1 వేకువజామున కూడా భూకంపం వచ్చినట్టు ఎన్సీఎస్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది.

  • Loading...

More Telugu News