Anjani Kumar: మంత్రి తలసాని కుమారుడి అయ్యప్ప పూజకు హాజరైన డీజీపీ అంజనీకుమార్

Anjan Kumar attends Talasani Saikiran Yadav Ayyappa pooja

  • అయ్యప్ప దీక్షలో ఉన్న తలసాని సాయికిరణ్ యాదవ్
  • తన నివాసంలో అయ్యప్ప పూజ నిర్వహణ
  • డీజీపీకి ఆహ్వానం.. స్వయంగా హారతి ఇచ్చిన డీజీపీ

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఆయన ఇవాళ తన నివాసంలో అయ్యప్పస్వామి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కూడా హాజరయ్యారు. ప్రత్యేక పూజలో పాల్గొన్న డీజీపీ స్వయంగా హారతి ఇవ్వడం విశేషం. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

అంజనీకుమార్ ఇటీవల తెలంగాణ నూతన డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం అంజనీకుమార్ కు బాధ్యతలు అప్పగించింది.

  • Loading...

More Telugu News