Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు కీలక తీర్పు

High Court supports ACB Courts verdict in MLAs poaching case

  • ముగ్గుర్ని నిందితులుగా చేరుస్తూ మెమో జారీ చేసిన సిట్
  • సిట్ మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు
  • ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎర వేశారనే కేసులో తెలంగాణ సిట్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గుర్నీ నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ లకు మెమో ఇచ్చింది. 

అయితే ఈ ముగ్గురినీ నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చుతూ, మెమోను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును సిట్ ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది. సిట్ అప్పీలును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News