Ayyanna Patrudu: ఏపీ సీఐడీ కేసులో అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court denies stay on High Court verdict over Ayyanna case

  • అయ్యన్నపై నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలు 
  • కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
  • ఈ కేసులో సెక్షన్ 467 వర్తింపజేయలేరన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
  • ఏపీ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలపై ఏపీ సీఐడీ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. 10 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని స్పష్టం చేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని తేల్చిచెప్పింది. 

అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News