CPI Narayana: ​మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలి: సీపీఐ నారాయణ​​​​​​​​​​​​​

CPI Narayana calls all parties to unite against YCP

  • ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టేనన్న నారాయణ 
  • బీజేపీకి వైసీపీ నుంచే అధిక మద్దతు లభిస్తోందని స్పష్టీకరణ
  • టీడీపీని బలహీనపర్చడం కోసం బీజేపీ పవన్ కల్యాణ్ ను లాగుతోందని వ్యాఖ్య 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీ నుంచే బీజేపీకి అత్యధిక మద్దతు లభిస్తోందని అన్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టేనని పేర్కొన్నారు. మోదీకి మద్దతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీని బలహీనపర్చడం కోసం బీజేపీ పవన్ కల్యాణ్ ను తమవైపునకు లాగే ప్రయత్నం చేస్తోందని అన్నారు. 

తమను వ్యతిరేకించే రాష్ట్రాల ప్రభుత్వాలపైనా, పార్టీలపైనా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని నారాయణ ఆరోపించారు. ఒకవేళ ఆ కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే రాత్రికిరాత్రే కేసులు మాయమవుతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీకి జై కొడితే కేసులన్నీ తొలగిపోతాయని పేర్కొన్నారు. శారద కేసుల్లో ఉన్న టీఎంసీ నేతలు బీజేపీలో చేరగానే ఏమైంది? అన్నారాయన. 

CPI Narayana
CPI
YSRCP
BJP
Narendra Modi
KCR
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News