TPCC: 11 మంది అధికార ప్రతినిధులకు తెలంగాణ పీసీసీ షోకాజ్ నోటీసులు

TPCC issues show cause notices to 11 spokespersons

  • నిన్న తెలంగాణ కాంగ్రెస్ సమావేశం
  • జూమ్ యాప్ ద్వారా మీటింగ్
  • పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టిన అధికార ప్రతినిధులు
  • వివరణ కోరిన తెలంగాణ కాంగ్రెస్

హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరవడం పట్ల పీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. మునుగోడు ఓటమి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో, ఆ ఉప ఎన్నిక ఫలితంపై సమీక్ష ఉంటుందని భావించారు. కానీ పెద్ద సంఖ్యలో అధికార ప్రతినిధులు ఈ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. 

జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇలా జూమ్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని బాహాటంగానే ప్రశ్నించారు. జగ్గారెడ్డి కూడా ఈ జూమ్ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఇదేమైనా కంపెనీనా.... ఇళ్లలో కూర్చుని చర్చించుకోవడానికి అంటూ జగ్గారెడ్డి నిలదీశారు.

TPCC
Spokespersons
Show Cause Notice
Zoom Meeting
Congress
Telangana
  • Loading...

More Telugu News