Telangana: పని చేయకపోతే.. సిరిసిల్ల ప్రజలు నన్ను ఎప్పుడో పక్కన పెట్టేవారు: కేటీఆర్

ktr said heir is not workout in politics

  • అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో జరిగిన చర్చకు హాజరైన కేటీఆర్
  • వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని వ్యాఖ్య
  • సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించరన్న మంత్రి
  • ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని వెల్లడి

వారసత్వ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వం రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మాత్రమే పనికి వస్తుందన్న కేటీఆర్... ప్రతిభను నిరూపించుకోకపోతే ఏ ఒక్కరూ రాజకీయాల్లో రాణించలేరన్నారు. ప్రతిభ లేకున్నా... కేవలం వారసత్వంతో రాజకీయాల్లో రాణించవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్న కేటీఆర్... ఆ భావన తప్పు అని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీడియా ఇన్ తెలంగాణ ఫాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై శనివారం జరిగిన చర్చలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 

ఈ సందర్భంగా రాజకీయ వారసత్వాన్ని ప్రస్తావించిన కేటీఆర్... వారసత్వం కేవలం రాజకీయాల్లోకి ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుందన్నారు. ఆ తర్వాత సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వ నాయకుడిని కూడా ప్రజలు భరించరని ఆయన చెప్పారు. ఇందిరా గాంధీ వంటి నేతలనే ప్రజలు ఓడించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వయంగా తన అంశాన్నే ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. తన పనితీరుతోనే సిరిసిల్లలో తనకు క్రమంగా మెజారిటీ పెరుగుతూ వస్తోందని ఆయన అన్నారు. తాను సరిగ్గా పనిచేయకపోయి ఉంటే... సిరిసిల్ల ప్రజలు తనను ఎప్పుడో పక్కనపెట్టేవారని కూడా ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News