Narendra Modi: జీ20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్, వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Modi unveils G20 Presidency logo and website

  • జీ20 దేశాల ప్రెసిడెన్సీ చేపట్టనున్న భారత్
  • భారత్ లో 200 వరకు సమావేశాలు
  • వచ్చే ఏడాది భారత్ లోనే శిఖరాగ్ర సమావేశం
  • ఇది చారిత్రక ఘట్టం అని అభివర్ణించిన ప్రధాని మోదీ

వచ్చే నెలలో భారత్ జీ20 దేశాల ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక ఘట్టం అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.  

'వసుధైక కుటుంబం' అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని అన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. 

ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. 

జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Narendra Modi
G20
Presidency
Logo
Website
India
  • Loading...

More Telugu News