Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 పాటలు... రాహుల్ గాంధీపై కేసు నమోదు

Case filed on Rahul Gandhi for using KGF 2 songs

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్టీ మ్యూజిక్
  • కేజీఎఫ్-2 పాటలపై హక్కులు తమవేనని వెల్లడి
  • కాంగ్రెస్ నేతలు అనుమతి లేకుండా పాటలు వాడుకుంటున్నారని ఫిర్యాదు

భారత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ తదితరులపై కేసు నమోదైంది. 

కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎమ్మార్టీ మ్యూజిక్ పేర్కొంది.

కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్ గ్రౌండ్ తో వీడియోలు రూపొందిస్తున్నారని ఎమ్మార్టీ మ్యూజిక్ ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News