Sirish: ఇంతకుముందులా ఇప్పుడెవరూ కామెడీ పాత్రలు రాయడం లేదు: సునీల్

Urvasivo Rakshasivo movie pre release event

  • సందడిగా శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ 
  • తన పాత్రను గురించి ప్రస్తావించిన సునీల్ 
  • ఇదివరకటిలా భారీ కథలు రావడం లేదని వ్యాఖ్య

బాలకృష్ణ ముఖ్య అతిథిగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో ఏర్పాటు చేశారు. అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "బాలకృష్ణగారి క్రమశిక్షణ గురించి .. ఆయన మంచి మనసును గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఈ ఫంక్షన్ కి రావడం ఆనందాన్ని కలిగించే విషయం" అని అన్నాడు. 

"గతంలో గీతా ఆర్ట్స్ లోని సినిమాలను లైన్లో నుంచుని టిక్కెట్టు కొని చూశాను. ఆ తరువాత గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేశాను. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను పోషిస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కామెడీ పాత్రలను గతంలో మాదిరిగా ఎవరూ రాయడం లేదు. ఇప్పుడు ఉపకథలన్నీ కథలైపోయాయి. ఈ సందులో నుంచి వెళ్లి ఆ సందులోకి తిరిగితే సినిమా అయిపోయిందని అంటున్నారు" అని చెప్పాడు. 

"భారీ కథలు .. ఆ కథలో భాగంగా కామెడీ ఎపిసోడ్స్ .. ఇప్పుడు ఉండటం లేదు. అందువలన ఇదివరకటిలా నేను కామెడీ వేషాలు వేయలేకపోతున్నాను. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు రాకేష్ శశి పాత సునీల్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమా ఇది. అల్లు శిరీష్ కి ఇంతకాలానికి సరైన సినిమా పడిందని నేను బలంగా చెప్పగలను" అంటూ ముగించాడు. 

Sirish
Anu Emmanuel
Urvasivo Rakshasivo Movie
  • Loading...

More Telugu News