Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends in losses

  • 287 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.83 శాతం నష్టపోయిన నెస్లే ఇండియా షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఊగిసలాటధోరణిలోనే ప్రయాణించాయి. రూపాయి బలహీనత, చమురు ధరలు పెరుగుతుండటం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287 పాయింట్లు నష్టపోయి 59,543కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 17,656కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.29%), మారుతి (2.72%), ఎల్ అండ్ టీ (1.98%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), కొటక్ బ్యాంక్ (-2.52%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.59%).

  • Loading...

More Telugu News