Sensex: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits for straight fourth session

  • ముడి చమురు ధరలు దిగిరావడంతో లాభాల్లో మార్కెట్లు
  • 147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 25 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 59,107కి చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,512 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.13%), రిలయన్స్ (1.88%), ఐటీసీ (1.79%), యాక్సిస్ బ్యాంక్ (1.69%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), ఇన్ఫోసిస్ (-1.23%).

  • Loading...

More Telugu News