Vizag: జనసేన నేతలకు బెయిల్ నిరాకరణ... పోలీసు కస్టడీకి 9 మంది నిందితులు

vizag court denies bail to janasena leaders

  • విశాఖ గర్జన రోజే నగరానికి వచ్చిన పవన్ కల్యాణ్
  • మంత్రులు రోజా, జోగి రమేశ్ కార్లపై దాడికి దిగిన జన సైనికులు
  • మొత్తం 70 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన కోర్టు

విశాఖలో మంత్రుల కార్లపై దాడికి దిగిన జనసేన నేతలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు తమకు బెయిల్ ఇవ్వాలంటూ అరెస్టయిన జనసేన నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విశాఖ కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... నిందితులను పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.

ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా... అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా... వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు... పోలీసుల అభ్యర్థన మేరకు వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది.

Vizag
Janasena
Pawan Kalyan
YSRCP
Visakha Garjana
  • Loading...

More Telugu News