Amaravati: అమరావతే ఏపీకి ఏకైక రాజధాని: రాహుల్ గాంధీ 

rahul gandhi supports amaravati farmers fight

  • కర్నూలు జిల్లాలో సాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
  • యాత్రలో ఉన్న రాహుల్ ను కలిసిన అమరావతి రైతులు
  • అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్న రాహుల్
  • రైతుల పోరాటానికి న్యాయ సాయం అందిస్తామని వెల్లడి

ఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో... రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా రాజధానిపై నెలకొన్న అనిశ్చితిని వారు ఆయనకు వివరించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించేలా తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ...అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని అన్నారు. ఏపీ రాజధానిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదేనని కూడా రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి న్యాయపరమైన సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

Amaravati
Andhra Pradesh
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
Kurnool District
  • Loading...

More Telugu News