Cable Bridge: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్ వంతెన

Iconic cable bridge on Krishna River between AP and Telangana
  • రూ.1,082.56 వ్యయంతో కేబుల్ బ్రిడ్జి
  • కేంద్రం ఆమోదం తెలిపిందన్న నితిన్ గడ్కరీ
  • 30 నెలల్లో పూర్తవుతుందని వెల్లడి
  • ప్రముఖ పర్యాటక కేంద్రం అవుతుందని ఆశాభావం 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల వ్యయంతో ఐకానిక్ తీగల వంతెనను నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య ఈ నిర్మాణం 30 నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. 

విశాలమైన శ్రీశైలం జలాశయానికి చేరువగా, నల్లమల అడవి, ఎత్తయిన కొండల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ వైపున లలితా సోమేశ్వర ఆలయం, ఏపీ వైపున సంగమేశ్వర ఆలయంతో ఇదొక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని వివరించారు.
Cable Bridge
Krishna River
Andhra Pradesh
Telangana
Nitin Gadkari

More Telugu News